Sunday, February 11, 2024

2024 కుజ గ్రహ సంచారం - దక్షిణ భారత దేశం పై తీవ్ర అస్థిరత కలిగించే ప్రభావం

 

ప్రస్తుతం మకర రాశి లో సంచారం చేస్తున్న కుజ గ్రహం , ఏప్రిల్ 2 వ తారీకు నుండీ మొదలుకుని శని గ్రహం తో పూర్వ భాద్ర నక్షత్రం లో యుతి లో వుండడం జరుగుతుంది. ఏప్రిల్ 10 వ తారీకు న ఖచ్చితమైన యుతి లో ఈ రెండు పాప గ్రహాలు వుంటాయి. ఏప్రిల్ 19 వ తారీకు నుండీ ఈ యుతి విడి పడి రెండు గ్రహాలు దూరం అవుతాయి. శని కుజులు ఇలా యుతి లో వుండడం వల్ల దుర్ఘటన లు ఎక్కువ గా జరిగే అవకాశం వుంటుంది. కుజుడు ముఖ్యం గా దక్షిణ భారత దేశాన్ని ప్రభావితం చేస్తాడు కనుక వింధ్యా పర్వతాల నుండీ దక్షిణ రాష్ట్రాలు అన్నీ శ్రీ లంక తో సహా ఎక్కువ ప్రభావితం అవుతాయి.

శని కుజులు యుతి తరువాత మే 12 నుండీ మొదలుకుని రాహు కుజులు యుతి లో వుంటారు. మే 19 న ఖచ్చితమైన యుతి లో ఈ రెండు గ్రహాలు వుంటాయి. మే 27 తరువాత నుండీ ఈ రెండు గ్రహాల యుతి ప్రభావం తగ్గుతుందని చెప్పవొచ్చు.
పైన చెప్ప బడిన రెండు గ్రహ యుతు ల కాలం లో హింసాత్మక ఘటనలు, అశాంతి, యాక్సిడెంట్లు, పోలీసు చర్య లు వంటివి ఎక్కువగా వుండే అవకాశం ఉంది.
ఆగస్ట్ నుండీ మిధున, కర్కాటక రాశులలో కుజుడు మామూలుగా కంటే ఎక్కువ కాలం వుంటాడు. ఈ సంవత్సరం కుజ వక్ర సంచారం, స్థంభన వున్నాయి.
రాబోయే క్రోధి నామ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం గమనార్హం.
దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగబోయే సంవత్సరం లో కుజుడి విపరీత యుతి , గతులు ఆందోళన కరమే.
ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వైరం ఎక్కువ వుంటుంది. ఒక దక్షిణ రాష్ట్రం లో ఏం ఎల్ ఏ ల తిరుగుబాటు మూలం గా ప్రభుత్వం సంవత్సరం ద్వితీయార్థంలో కూలిపోవడం జరుగుతుంది.